బిజినెస్

వనె్న తగ్గని పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: బంగారం ధర వరుసగా మూడో రోజు శనివారం కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ. పది పెరిగి, రూ. 31,350కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో పసిడి ధర మూడో రోజు కూడా పెరిగింది.
పారిశ్రామిక యూనిట్లు గణనీయంగా కొనుగోళ్లు జరపడంతో వెండి ధర కూడా శనివారం పెరిగింది. కిలో వెండి ధర రూ. 50 పెరిగి, రూ. 38,350కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పటిష్టంగా ఉండటంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పండుగల సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా స్థానిక నగల వ్యాపారుల నుంచి స్థిరంగా కొనుగోళ్లు పెరుగుతుండటం వల్ల దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే, న్యూయార్క్‌లో శుక్రవారం నాటి లావాదేవీలలో ఒక ఔన్స్ బంగారం ధర 0.10 శాతం పెరిగి, 1,200.80 డాలర్లకు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శనివారం పది గ్రాములకు రూ. పది పెరిగి, రూ. 31,350కి చేరుకుంది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. పది పెరిగి, రూ. 31,200కు చేరుకుంది. క్రితం రెండు రోజుల్లో కలిసి పది గ్రాముల బంగారం ధర రూ. 260 పెరిగింది.
అయితే సావరిన్ గోల్డ్ ధరలో శనివారం ఎలాంటి మార్పు లేదు. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,500 పలికింది. కిలో వెండి ధర రూ. 50 పెరిగి, రూ. 38,350కి చేరుకుంది. వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 160 పెరిగి, రూ. 37,115కు చేరుకుంది. అయితే వెండి నాణేల ధరలో శనివారం ఎలాంటి మార్పు లేదు. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 73,000గా, విక్రయ ధర రూ. 74,000గా కొనసాగింది.