బిజినెస్
అయిదు శాతం తగ్గిన నగల ఎగుమతులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 3 September 2018
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మన దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో సుమారు అయిదు శాతం తగ్గి, 10.64 బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్నాయి. ప్రధాన అభివృద్ధి చెందిన మార్కెట్లలో వీటికి డిమాండ్ తగ్గడం వల్ల వీటి ఎగుమతులు తగ్గిపోయాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) గణాంకాల ప్రకారం, 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో భారత్ నుంచి 11.2 బిలియన్ డాలర్ల విలువ గల రత్నాలు, నగలు ఎగుమతి అయ్యాయి. మన మొత్తం ఎగుమతుల్లో సుమారు 14 శాతం వరకు రత్నాలు, ఆభరణాలే ఉన్నాయి.