బిజినెస్

పదో రోజూ పెట్రోవాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 4: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మొదటిసారి గరిష్ఠ స్థాయిని తాకాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా పదో రోజు మంగళవారం ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ. 79.31కి, డీజిల్ ధర రూ. 71.34కు చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర ముంబయిలో రూ. 86.72కు, చెన్నైలో రూ. 82.41కి, కోల్‌కతాలో రూ. 82.22కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ. 75.74కు, చెన్నైలో రూ. 75.39కి, కోల్‌కతాలో రూ. 74.19కి చేరుకుంది. పెరిగిన ధరలు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చాయి. స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. ఇతర మెట్రో నగరాలు, చాలా రాష్ట్రాల రాజధాని నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పాటు దేశంలో ఇంధన రవాణాపై అధిక ఎక్సైజ్ పన్ను కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.