బిజినెస్

సర్వీస్ ప్రొవైడర్లకు ట్రాయ్ వడ్డింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, ప్రస్తుతం ఒకటిగా కలిసి వొడాఫోన్, ఐడియా తదితర సర్వీస్ ప్రొవైడర్లకు టెలికారం నియంత్రణ సంస్థ (ట్రాయ్) జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వినయోగదారులకు సరైన సేవలను అందించడంలో విఫలమైన కారణంగా ఈ వడ్డింపు చేసింది. 2016లో మొబైల్ రంగంలోకి సంచలనాత్మక ప్లాన్స్‌తో దూసుకొచ్చిన రిలయన్స్ జియోపై 34 లక్షల రూపాయలు జరిమానా విధించినట్టు సమాచారం. ట్రాయ్ నిబంధనల ప్రకారం వినియోగదారులకు సర్వీస్ ప్రొవైడర్లు ఉత్తమ సేవలను అందించాల్సి ఉంది. అయితే, జియోసహా పలు సర్వీస్ ప్రొవైడర్లు ఈ ప్రమాణాలను పాటించకపోవడంపై ట్రాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఎయిర్‌టెల్‌కు 11 లక్షలు, ఐడియాకు 12.5 లక్షలు, వొడాఫోన్‌కు 4 లక్షల చొప్పున జరిమానా విధించిందని తెలుస్తున్నది. నాణ్యతా ప్రమాణాలను పాటించని సర్వీస్ ప్రొవైడర్లపై ట్రాయ్ కొరడా ఝళిపిస్తున్నది.