బిజినెస్
గో మూత్రం, పేడ నుంచి సౌందర్య సాధనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మథుర, సెప్టెంబర్ 22: పవిత్రమైన గోమాత మూత్రం, పేడ నుంచి సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయాలన్న సంకల్పానికి ఆరెస్సెస్ అనుబంధ విభాగం దీన్ దయాళ్ ధామ్ శ్రీకారం చుట్టింది. త్వరలో ఆమెజాన్ ఇండియా ద్వారా సబ్బులు, ఫేస్ ప్యాక్లు, షాంపూలు, ఔషధ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఈ కామర్స్ ద్వారా అమెజాన్ సంస్థ నుంచి విక్రయాలు చేస్తారు. దాదాపు ఒక డజను ఉత్పత్తులతో మార్కెట్ను ముంచెత్తనున్నారు. వారం రోజుల్లో అమెజాన్ సంస్థ వెబ్సైట్లో ఈ ఉత్పత్తులపై ప్రకటనలు జారీ చేయనున్నారు. ఈ వివరాలను దీన్ దయాల్ధామ్ ప్రతినిధి ఘన్శ్యాం గుప్తా తెలిపారు. అమెజాన్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే డెలివరీ చేస్తామన్నారు. ఉత్పత్తులను తమ సెంటర్ నుంచే డెలివరీ చేస్తామన్నారు. దీన్ దయాళ్ దామ్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న శ్యాం మాట్లాడుతూ ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందన్నారు. ఇరుగుపొరుగు గ్రామాల్లో ఉన్న మహిళలు గోశాల ఫార్మసీలో పనిచేస్తున్నారన్నారు. గో మూత్రం,పేడ తదితర వౌలిక పదార్థాలతో అనేక రోగాలను నయం చేసేందుకు ఉద్దేశించిన ఔషధాలను తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులను ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ లు ప్రాచుర్యం చేస్తారని కూడా చెప్పారు. భారత్ తంతితపాలాతో ఒప్పందం కుదుర్చుకుని ఉత్పత్తులను కస్టమర్లకు పది రోజుల్లో డెలివరీ చేసే విధానం అమలు చేస్తామన్నారు.