బిజినెస్

ఎన్‌టీపీసీ ఒడిశా ప్రాజెక్టు విస్తరణకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఒడిశాలో ఎన్‌టీపీసీ ప్రాజెక్టు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడి తల్చెర్ థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణ పనులకు అంచనా వేసిన 7,732.35 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రస్తుతం ఉన్న తల్చెర్ థర్మల్ టెహెర్మల్ పవర్ ప్రాజెక్టు (టీటీపీపీ)లో ఒకొక్కటీ 660 మెగావాట్స్ సామర్థ్యంగల రెండు కొత్త యూనిట్లను నెలకొల్పడానికి పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్టు ఒక అధికారి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. బొగ్గు ఆధారిత ఈ రెండు పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించిన తర్వాతే విస్తరణ ప్రతిపాదనలకు ఓకే చెప్పినట్టు తెలిపారు. స్థానికంగానేగాక, ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఉందని, అందుకే, విస్తరణ చర్యలు చేపట్టామని ఆ అధికారి వివరించారు.