బిజినెస్
డిజిటల్ విధానంలో రైతులకు రుణాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 December 2018
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వ్యవసాయ రుణాలను డిజిటల్ పద్ధతిలో రైతులకు పంపిణీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టులను ఒకటి రెండు చోట్ల నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా చెప్పా రు. రైతుల భూ రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఈ రుణాలివ్వడం సులభమవుతుందన్నారు. పైలెట్ ప్రాజెక్టు ల నిర్వహణ జయప్రదమైతే దేశవ్యాప్తంగా త్వరలో అమలు చేస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకునే విషయమై తమ బ్యాంకు దృష్టిసారించినట్లు చెప్పారు. ఆయన ఇక్కడ సమీకృత ఆర్థిక సదస్సు 2018లో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులకు విరివిగా రుణాలు ఇస్తామన్నారు. డిజిటల్ రుణాల సేవలు ప్రతి రైతుకు అందించేందుకు కృషి చేస్తామన్నారు.