బిజినెస్

మూడు వారాలుగా వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత ప్రధాన మార్కెట్లలోకి గడచిన మూడు వారాలుగా విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విదేశీ ఇనె్వస్టర్లు ఈ మూడువారాల్లో మదుపు చేశారు. అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి విలువ పెరగడం, ముడిచమురు ధరల్లో తరుగుదల ఈ పరిణామానికి దోహదం చేశాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన నవంబర్ నాటికి సుమారు పదినెలల గరిష్టానికి ఈక్విటీ, రుణ రంగాల్లో విదేశీ పెట్టుబడులు సుమారు 12,266 కోట్ల రూపాయలు వచ్చిన అనంతరం ఈ మూడు వారాల పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. డిసెంబర్ 3 నుంచి 21 వరకు విదేశీ ఇనె్వస్టర్లు ఈక్విటీల్లో రూ.1.332 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్లో రూ.2,552 కోట్ల రూపాయలు మదుపు చేశారని డిపాజిటరీస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 15 నెలల కనిష్టానికి చేరుకోవడం విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు ఊతం ఇచ్చింది. డిసెంబర్ 7 నుంచి రూ.383 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కు తీసుకున్నారు.
అయితే అదే సమయంలో రుణ సంబంధ మార్కెట్లోకి 2,744 కోట్ల రూపాయలు విదేశీయులు పెట్టుబడులు పెట్టడం జరిగింది. డిసెంబర్ 6న ఒక్కరోజే విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఆస్తులను 361 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిపారు. చైనాకు చెందిన హై ప్రొఫైల్ కార్యనిర్వహణాధికారిని అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లను బలహీనపరిచిన క్రమంలో ఇలా రెండు రోజులపాటు ప్రభావం భారత మార్కెట్లపై పడిందని మార్నింగ్ స్టార్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ విభాగం సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాత్సవ విశే్లషించారు. విదేశీ మదుపర్లు ఈ యేడాది ఇప్పటి వరకు సుమారు 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.