బిజినెస్

వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 23: రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా రూ. 35వేల కోట్లు లాభాలను గడించాలనే ధ్యేయం తో పనిచేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియం ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీ్ధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో ఆరు కొత్త బ్లాకుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 1200 కోట్లు లాభాలు ఆర్జించిన సింగరేణి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1300 కోట్లు లాభాలు ఆర్జిస్తుందని విశ్వాసం ప్రకటించారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి సింగరేణి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలోని వందలాది విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయటంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సైతం లాభాలు గడిస్తూ దేశ అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 130 మెగావాట్ల ఉత్పత్తికి పనులు వేగవంతంగా సాగుతున్నాయని సీఎండీ శ్రీ్ధర్ వివరించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్, డైరెక్టర్లు భాస్కర్‌రావు, శంకర్, బలరాం, గుర్తింపు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావ్, సీఎంవోఏ అధ్యక్షుడు గడిపెల్లి కృష్ణప్రసాద్, జనరల్ మేనేజర్లు బసవయ్య, ఆనందరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్