బిజినెస్

రిజర్వ్ బ్యాంకు స్వతంత్రతను పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: రిజర్వుబ్యాంకు స్వతంత్రతను కాపాడేందుకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ధర్మనిరతితో వ్యవహరించాలని సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సూచించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు పనిచేసిన గవర్నర్లలాగే దాస్ కూడా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన సూచించారు. క్లిష్టతర అంశాల పరిష్కారం విషయంలో దాస్ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరించాలని రంగరాజన్ సూచించారు. ఢిల్లీకి చెందిన ఎందరో బ్యూరోక్రాట్లు ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ పదవిని నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఒకసారి ఈ గురుతర బాధ్యతను చేపట్టిన తర్వాత రిజర్వుబ్యాంకు స్వతంత్రను రక్షించే విషయంపై పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సివుంటుంద’ని ఆయన హితవు పలికారు. ఇక్కడి ఐజీఐడీఆర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దిలీప్ నాచనే రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రంగరాజన్ పీటీఐతో మాట్లాడారు. గతంలో తానూ, డీ. సుబ్బారావుఈ హోదాలో పనిచేసినపుడు పలుసందర్భాల్లో గవర్నర్ల ‘్ధర్మం’ గురించి ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రిజర్వు బ్యాంకు నుంచి ఎలాంటి త్యాగాలూ లేకుండా ఆ బ్యాంకు అస్థిత్వాన్ని రక్షంచేందుకు అటు బ్యాంకు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కొత్త గవర్నర్ సమన్వయంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. జాతీయ స్థూలాదాయం (జీడీపీ) విషయంలో నెలకొన్న అయోమయాన్ని పారదోలేందుకు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) పూర్తి వివరాలను వెల్లడించాల్సివుందని రంగరాజన్ పేర్కొన్నారు. గతంలో రంగరాజన్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. సీఎస్‌ఓ ఎంతో బాధ్యతాయుతమైన కార్యాలయమని గుర్తుచేస్తూ అన్ని విషయాల్లో ఆ కార్యాలయం స్పష్టతను పాటించాలని హితవుపలికారు. అసలు గతంలోని జీడీపీ గణాంకాలను మార్చేందుకు ఏ విధానాలను అనుసరించారో వివరించాలన్నారు. ‘మనం సంతృప్తికరంగా ఉంటేనే ఇతర అంశాలపైకి దృష్టి మళ్లుతుంది. లేదంటే అంతర్గత సమస్యలతో సతమతమవుతాం’ అని ఆయన వ్యాఖ్యానిస్తూ ఆర్బీఐని స్వేచ్ఛాయుత స్థానంలో ఉంచి తనపని తాను చేసుకునేలా చూడాలని రంగరాజన్ సూచించారు.