బిజినెస్

దేశ ఆర్థికాభివృద్ధి కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: త్వరలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని 12 నుంచి 18 శాతం శ్లాబ్‌లతో విలీనం చేయడం ద్వారా హేతుబద్ధీకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడిక్కడ సంకేతాలు ఇచ్చారు. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో 31శాతం ప్రత్యక్ష పన్నుబాదుడుతో దేశ ప్రజలు సతమతమయ్యారని ఆయన దుయ్యబట్టారు. పెరిగిన దేశ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణంగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ రేటును 12 నుంచి 18 శాతానికి పరిమి తం చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత సున్నా శాతం నుంచి 5 శాతం వరకు ఉన్న పన్నుకు ఇది అదనమని ఆయన తెలిపారు. అలాగే లగ్జరీ, సిన్ అండ్ డీమెరిట్ వస్తువులపై మరింత అదనపు పన్ను విధించడం జరుగుతుందని ఫేస్‌బుక్‌లో ‘పద్దెనిమిది నెలల జీఎస్టీ’ పేరిట పెట్టిన పోస్టులో జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగంలోవున్న సుమారు 1.216 వస్తువుల్లో 183 వస్తువులపై జీరో పన్నురేటు, 308 వస్తువులపై 5శాతం, 178 వస్తువులపై 12 శాతం, 517 వస్తువులపై 18 శాతం వంతున పన్ను ఉంటోందని, 28 శాతం శ్లాబ్ ప్రస్తుతం మృత స్లాబ్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. లగ్జరీ, సిన్ గూడ్స్, ఆటో విడిభాగాలు, డిష్ వాషర్లు, ఎయిర్ కండిషనర్లు, సిమెంటుకు 28 శా తం అత్యధిక పన్ను శ్లాబ్ రేటు ఉందని తెలిపారు. మొత్తం సమాచార సేకరణ పూర్తయిన తర్వాత కొత్త గా హేతుబద్ధీకరించిన జాబితా తొలిసెట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శా తం పన్ను ఉండే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తదుపరి సిమెంటును తక్కువ పన్ను శ్లాబ్ పరిధిలోకి తీసుకువస్తామని జైట్లీ తెలిపారు. ఇప్పటికే భవన నిర్మాణానికి వినియోగించే అన్ని మెటీరియల్స్‌పై పన్ను శాతాన్ని 28 నుంచి 18, 12 శాతాలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలపై కనె్నర్ర
జీఎస్టీ ద్వారా ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ నేతల విమర్శలపై జైట్లీ ఈ సం దర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పన్ను జా బితాతో కూడిన ఇండెక్స్ పన్నుల భారాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు, పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఇలా సరళతరం చేయడం వల్ల పన్ను వసూళ్లు పెరిగడమేకాకుండా వాణిజ్య విస్తరణకు వీలవుతుందన్నారు. అలాగే దేశ స్థూల వృద్ధిరేటు సైతం రాబోయే సంవత్సరాల్లో బాగా పెరుగుతుందన్నారు. అనేక వస్తువులపై 31 శాతం పరోక్ష పన్నుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన భారాన్ని జీఎస్టీ తగ్గిస్తుందన్నారు.