బిజినెస్

పెథాయ్ తుపాను పీడిత ప్రాంతంలో అతిస్వల్ప వ్యవధిలో రిగ్ పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తూర్పు సముద్ర తీర ప్రాంతంలో తుపాను పీడిత ఓఎన్‌జీసీ సెమీ సబ్‌మెర్సిబుల్ క్షేత్రం ‘ఒలిండా స్టార్’లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన నిపుణుల బృందం రక్షణ చర్యలు చేపట్టింది. రికార్డు స్థాయిలో రిగ్‌ను పునరుద్ధరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ఈనెలారంభంలో పెథాయ్ తుపాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా తుపాను అనంతరం అక్కడి కంపెనీ విభాగం స్థితిగతులపై కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రోలాజికల్ డిపార్టుమెంటు తుపాను హెచ్చరికలు చేసిన వెంటనే అక్కడి ఒలిండా స్టార్ రింగ్‌లో పనిచేసే 111 మంది సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడి నుంచి ఈనెల 14,15 తేదీల్లో ఖాళీచేయించామని, ఇందుకోసం ప్రత్యేకంగా పడవలు, హెలికాప్టర్లు వినియోగించామని కంపెనీ తెలిపింది. తుపాను వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఒలిండా స్టార్ ప్రాంతంలో బాగా ప్రభావితమైన విషయాలను గమనించామని, ప్రధానంగా ప్రత్యేక బృందం అక్కడి బల్లాస్టింగ్ సిస్టం ద్వారా పునరుద్ధరణ చర్యలు చేపట్టిందన్నారు. ప్రధానంగా ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్ర కెరటాలు అక్కడి రిగ్‌ను దెబ్బతీసే పరిస్థితుల్లో ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్లు సహాయంతో నిపుణుల బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని కంపెనీ వివరించింది. సాల్వేజ్ టీం సభ్యులతోబాటు మొత్తం 12 మంది ఈనెల 21న రిగ్‌ను పునరుద్ధరించి సాల్వేజ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ ప్రకటన పేర్కొంది. ఓఎన్‌జీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశిశంకర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేశారని సంస్ధ వివరించింది. తుపాను అనంతరం నిర్వహించిన ఇన్స్‌పెక్షన్ సందర్భంగా రిగ్‌లో ఎలాంటి లోపాలూ కనిపించలేదని, అలాగే పరికరాలకు కూడా ఎలాంటి నష్టం కలగలేదని తేలిందని, వెంటనే పనిని ప్రారంభించేందుకు వీలుగానే ఉన్నాయని తెలిపింది. బాల్లెస్టింగ్ సిస్టం ద్వారా రిగ్‌ను లెవల్‌గా ఏర్పాటుచేసేందుకు నిపుణుల బృందం సమయ స్ఫూర్తితో వ్యవహరించిందని తెలుపుతూ, రిగ్ త్వరలోనే యథావిథిగా డ్రిల్లింగ్‌ను ఆరంభిస్తుందని వివరించింది. ఈయేడాది జనవరి నుంచి ఈ రిగ్ పనిచేస్తోంది. కాగా ఇలా అతి స్వల్ప రికార్డుటైంలో రిగ్ పునరుద్ధరణ జరగడం ఇదే తొలిసారని కంపెనీ ప్రకటన తెలిపింది.