బిజినెస్

పరిశ్రమల రంగానికి ప్రధాని ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: పరిశ్రమల రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలు ఎంతో ఊతం ఇస్తున్నాయని యూపీ పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహన పేర్కొన్నారు. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో వచ్చే జనవరి 15 నుండి ప్రారంభమయ్యే కుంభమేళా గురించి ప్రజాచైతన్యం తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. మంత్రిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, కార్యదర్శి పాపారావు, కోశాధికారి బీ శాంతి కుమార్ తదితరులు ఆయనను ఘనంగా స్వాగతించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయనను సత్కరించారు.
చిత్రం..యూపీ పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు