బిజినెస్

ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతాగోపీనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషిగ్టన్, జనవరి 8: అంతర్జాతీయ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా ప్రఖ్యాత భారత-అమెరికన్ ఆర్థిక శాస్తవ్రేత్త గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలో ఈ అత్యున్నత స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ ఈమే కావడం గమనార్హం. ఈ నలభై ఏడేళ్ల ఇండో అమెరికన్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచీకరణ వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె భావిస్తున్నారు. బహుళార్థ సాధక సంస్థలకు ప్రపంచీకరణ కారణంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని ఆమె భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్, అమెరికా పౌరుడు జాన్ జ్వాన్‌స్ట్రా గతంలో ఈ పదవిలో ఉండి గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. కాగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టైన్ లాగ్రేడ్ మంగళవారం గీతా గోపీనాథ్ నియామకాన్ని ప్రకటిస్తూ అత్యున్నత విద్యార్హతలతోబాటు, విశిష్ట ఆర్థిక శాస్త్ర నిపుణత కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. కాగా ఐఎంఎఫ్ 11వ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె కర్నాటక రాష్ట్ర మైసూరులో జన్మించారు. ఆమె నియామకం ఓ అద్భుతమని హార్వర్డ్ విశ్వవిద్యాలయ గెజిట్ ప్రశంసల వర్షం కురిపించింది.