బిజినెస్

పెరిగిన టెక్ మహీంద్ర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశీయ ఐటిరంగ సంస్థ టెక్ మహీంద్ర ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 28 శాతం పెరిగి 796 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 622 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 6,920.93 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 6,293.82 కోట్ల రూపాయలుగా ఉందని సోమవారం సంస్థ తెలిపింది. నిరుడుతో పోల్చితే ఆదాయం సుమారు 10 శాతం పెరిగినట్లు పేర్కొంది.