బిజినెస్
ఫిన్టెక్ రంగానికి సీఐఐ సహకారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ: రాష్ట్రంలో ఫిన్టెక్ రంగానికి సీఐఐ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో సీఐఐ, ఏపీ ఫిన్టెక్ వ్యాలీ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఆర్బీఐ, దేశంలోని వివిధ ఫైనాన్స్ వ్యవస్థలు, ఫైనాన్స్ కంపెనీలతో సమన్వయ వేదికను సీఐఐ ఏర్పాటు చేయనుంది. మానిటరీ ఆథారిటీ ఆఫ్ సింగపూర్, సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫిన్టెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకరించనుంది. బజాజ్ ఫిన్సెర్వ్ ఎండీ, సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ ఇన్సూరెన్సు అండ్ పెన్షన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్తో మంత్రి, ఐటీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ఫిన్టెక్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. ఇప్పటికే 25 ఫిన్టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించాయన్నారు. విశాఖ ఫిన్టెక్ హబ్గా మారుతోందని వివరించారు. మరిన్ని ఫిన్టెక్ కంపెనీలు ఏపీకి వచ్చేలా యూజ్కేస్ రిపాజిటరీ ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్ రికార్డ్సు డిజిటలైజ్ చేయడంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పిస్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, 24 వేల కోట్ల రూపాయలతో ఆంధ్రా పేపర్ ఎక్స్లెన్సు, కియా మోటార్స్ వచ్చాయని గుర్తు చేశారు. ఆనంతరం వారు ఆర్టీజీ సెంటర్ను సందర్శించారు. వివిధ టెక్నాలజీల అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్సు అమలు చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారునికి సంక్షేమ కార్యక్రమాలు సులభంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టులను ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. కాగిత రహిత పాలన అమలు లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. టెక్నాలజీ వినియోగంతో ఒక రాష్ట్రం ఇన్ని కార్యక్రమాలను అమలు చేయడం తాను మొదటి సారి చూస్తున్నానని సంజీవ్ బజాజ్ తెలిపారు. ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఏపీలో ఫిన్టెక్ రంగం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
చిత్రం..మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంటున్న
సీఐఐ, ఏపీ ఫిన్టెక్వ్యాలీ ప్రతినిధులు