బిజినెస్

స్వల్ప పతనంతో ముగిసిన మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 11: లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప నష్టంతో స్టాక్ మార్కెట్ ముగిసింది. నాలుగు రోజుల వరుస లాభాలకు గురువారం గండిపడిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లోనూ లాభాలు నమోదవుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా సెనె్సక్స్ 36,214.26 నుంచి 35,840.60 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి అత్యధికంగానీ, అత్యల్పంగానీ కాకుండా మధ్యస్తంగా 96.66 పాయింట్లు (0.27 శాతం) పతనమై 36,191.87 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.65 పతనమై 10,794.95 పాయింట్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లు బలపడుతున్న తరుణంలో బీఎస్‌ఈలో అందుకు ప్రతికూలమైన వాతావరణం కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో, ఇతరత్రా వ్యాపకాల్లో మునిగి, స్టాక్ మార్కెట్‌పై మదుపరులు పెద్దగా ఆసక్తి చూపలేదన్న వాదన వినిపిస్తున్నది. కాగా, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. లాభాలను ఆర్జించిన కంపెనీల్లో ఐటీసీ, ఓఎన్‌జీసీ, వేదాంతా లిమిటెడ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. ఫోరెక్స్‌లో డాలర్ 70.55 రూపాయలుగా ట్రేడ్ అయింది. అంటే, డాలర్‌కు రూపాయి విలువ 21 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 1.10 శాతం పెరిగి, బ్యారెల్ ధర 62.36 డాలర్లకు చేరింది.
మూడు శాతం పతనమైన టీసీఎస్ షేర్లు
టీసీఎస్ షేర్లు 3 శాతం పతనమైంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం 24.1 శాతం పెరిగినట్టు టీసీఎస్ ప్రకటించింది. అయినప్పటికీ, ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ 1,840 రూపాయలకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఈ పతనం స్పష్టంగా కనిపించింది. 2.71 శాతం నష్టపోయిన టీసీఎస్ షేర్ ధర 1,837.15 రూపాయలకు చేరింది. సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించిన టీసీఎస్ మూడో త్రైమసాకంగా నికర లాభంలో 24.1 శాతం పెరిగినట్టు ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ కంపెనీ త్రైమాసికంగాలో 8,105 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంలో 6,531 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించిన టీసీఎస్ మూడో త్రైమాసికంలో అంతకంటే మెరుగైన వృద్ధిరేటును నమోదు చేసింది. మొత్తం మీద ఈ కంపెనీ రెవెన్యూ వృద్ధి సగటున 20.8 శాతానికి చేరి, 37,338 కోట్ల రూపాయలుగా నివేదికలో కనిపిస్తున్నది. గత ఏడాది ఇదే సమయానికి టీసీఎస్ మొత్తం లాభం 30,904 కోట్ల రూపాయలు.