బిజినెస్

‘బై బ్యాక్’కు ఇన్ఫోసిస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: వాటాల బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. 8,260 కోట్ల రూపాయల విలువైన వాటాలను తిరిగి కొనాలని పాలక మండలి నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కేటాయింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. షేర్లను అమ్మేందుకు వాటాదారులను ఆకర్షించే దిశగా ఒక్కో వాటాకు నాలుగు రూపయల చొప్పున ప్రత్యేక డివిడెంట్ ఇవ్వాలని తీర్మానించినట్టు ఇన్ఫోసిస్ వివరించింది. కంపెనీకి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షాను మళ్లీ నియమించాలని కూడా నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 22వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇన్ఫోసిస్ ప్రకటన ప్రకారం, ఆ కంపెనీ 10,32,50,000 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి చెల్లించిన మూల ధనంలో ఇది 2.36 శాతం. ఈ వాటాలు కొనేందుకు 8,260 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో భారత స్టాక్ ఎక్ఛ్సేంజ్ ద్వారా ఇన్ఫోసిస్ షేర్లను అమ్మింది. ఇప్పుడు ఒక్కో వాటాను 800 రూపాయలకు మించకుండా తిగిరి కొనడానికి తీర్మానించింది. అమెరికన్ డిపాజిటరీ షేర్ (ఏడీఎస్)ను షేర్ల రూపంలోకి మార్చుకోవడానికి కూడా ఇన్ఫోసిస్ అనుమతించింది. ఫలితంగా ఏడీఎస్‌లో ఉన్న వాటాలు ఈక్విటీ కిందకు మారిపోతాయి. అప్పుడు వాటిని ‘బై బ్యాక్’లో కొనుగోలు చేసే వీలుంటుంది. ఇన్ఫోసిస్ ఈ విధంగా గతంలో అమ్మిన ఈక్విటీ వాటాలను తిరిగి కొనడం ఇది రెండోసారి. 2017 డిసెంబర్‌లో, మొదటిసారి 13,000 కోట్ల రూపాయలతో, 11.3 శాతం షేర్లను ఒక్కొక్కటీ 1,150 రూపాయలు చెల్లించి కొనింది. సుమారు మూడు దశాబ్దాల కంపెనీ చరిత్రలో ఇన్ఫోసిస్ వాటాలను తిరిగి కొనడం అమే మొదటిసారి. సుధా గోపాలకృష్ణన్, రోహన్ మూర్తి, ఎల్‌ఐసీ కీలకంగా వ్యవహరించడంతో అప్పుడు ‘బై బ్యాక్’ విజయవంతమైంది. కాగా, శుక్రవారం సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో మరోసారి ‘బై బ్యాక్’ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈసారి 2.36 శాతం వాటలను కొనాలని తీర్మానించింది.
త్రైమాసిక లాభాలు రూ. 3,609
గడచిన డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఆదాయం రూ.21.400 కోట్ల రూపాయలుకాగా అంతకు ముందు యేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.8 శాతం అధికం, ఆ త్రైమాసికంలో ఈ కంపెనీ కోట్లు 20,607 ఆర్జించింది. జనవరి 11 నాటికి గడచిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.3,609 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. అయితే లాభాల్లో మాత్రం ఈ త్రైమాసికంలో 12.2 శాతం తగ్గుదల దమోదైంది. గడచిన త్రైమాసికంలో రూ.4,110 కోట్ల లాభాలు ఈ కంపెనీకి రాగా ప్రస్తుత త్రైమాసికంలో సుమారు 500 కోట్లమేర తగ్గడం గమనార్హం. కంపెనీ మార్కెట్ నియంత్రణ విభాగానికి సమర్పించిన గణాంకాల మేరకు దాదాపు 25 విశే్లషణల మేరకు ఈ ఐటీ రంగ దిగ్గజ కంపెనీ త్రైమాసిక అంచనాలు రూపొందించారు.
అందులో ప్రధానమైన అంశాలివే..
ద్రవ్య లభ్యతను అనుసరించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కంపెనీ ఆదాయాభివృద్ధి 2.7 శాతం, ఇదే త్రైమాసికంలో అంతకు క్రితం యేడాది 10.1 శాతం ఆదాయభివృద్ధి జరిగింది. పెరుగుతున్న క్లెయింట్ రిలవెన్స్‌తో తాము వృద్ధిలో ఏ యేటికాయేడు స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన డబుల్ డిజిట్ వృద్ధి రేటును అందుకోగలుగుతున్నామని ఆ కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ ప్రకాష్ పేర్కొన్నారు. అదే క్రమంలో డిజిటల్ ఆదాయంలో సైతం గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో 5 శాతం వృద్ధిని చూస్తున్నామని అన్నారు. ఈ ఆదాయంలో సైతం యేడాదికి 33.1 శాతం వృద్ధి జరుగుతోందన్నారు. 2019వ సంవత్సరంలోకి మంచి ఫలితాలతోనే అడుగిడుతున్నందున ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.