బిజినెస్
దిగొచ్చిన పసిడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 March 2019
న్యూఢిల్లీ, మార్చి 29: బులియన్ మార్కెట్లో రోజురోజుకూ పైపైకి పోతున్న పసిడి ధర శుక్రవారం దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ఏకంగా 395 రూపాయలు పతనమై, 32,700 రూపాయలకు చేరింది. 33,095 రూపాయల వద్ద మొదలైన లావాదేవీలు ప్రారంభం నుంచే నష్టాలను చవిచూశాయి. అటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులుగానీ, ఇటు దేశీయ మదుపరులుగానీ ఆసక్తిని ప్రదర్శించకపోవడంతో, బులియన్ మార్కెట్ నీరుగారిపోయింది. దీనికితోడు నగల వ్యాపారుల నుంచి కూడా డిమండ్ తగ్గడంతో బంగారం ధర భారీగా తగ్గింది. కాగా, కిలో వెండి ధర 590 రూపాయలు పతనమై, 38,260 రూపాయలకు చేరింది.