బిజినెస్
పెరిగిన బంగారం ధర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 April 2019
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: బులియన్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగియడం, బులియన్ మార్కెట్కు కలిసొచ్చింది. పది గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి, 32,870 రూపాయలకు చేరింది. అదే విధంగా కిలో వెండి ధర 295 రూపాయలు పెరగడంతో, 38,520 రూపాయలుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో సాగుతున్నదనే సమాచారంతో దేశీయ మదుపరులు బులియన్ మార్కెట్పైపు దృష్టి సారించారు. దీనికితోడు నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ రెండు అంశాలూ సానుకూలంగా మారడంతో, బులియన్ మార్కెట్ లాభాల బాట పట్టింది.