బిజినెస్

ఉక్కు కర్మాగారంపై ‘పోస్కో’ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆ కంపెనీ సీఈవో బాంగ్ గిల్ హో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించి స్థలాన్ని ఎంపిక చేస్తారు.