బిజినెస్
ఎనిమిది అంకుర సంస్థల్లో శామ్సంగ్ వెంచర్ రూ. 58 కోట్ల పెట్టుబడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 July 2019
న్యూఢిల్లీ, జూలై 10: మన దేశంలోని నాలుగు అంకుర సంస్థల్లో 8.5 మిలియన్ డాలర్లు (రూ. 58.28 కోట్లు) మదుపు చేసినట్టు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ వెంచర్ ఇనె్వస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్వీఐసీ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. అంతర్జాతీయంగా అనేక అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఎస్వీఐసీకి సుమారు 2.2 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్నాయి. కాగా ఈ సంస్థ మనదేశంలో వచ్చే ఐదేళ్లలో దాదాపు వంద అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టే అలోచనతో ఉంది. కాగా ఎస్వీఐసీ ఎంచుకున్న అంకుర సంస్ధల్లో సిస్టం ఆప్స్ కంపెనీ ఓఎస్ల్యాబ్స్, ఇండస్ ఆపరేటింగ్ సిస్టం, స్పీచ్ టెక్నాలజీ స్టార్టప్ ‘జ్ఞానీ. ఏఐ, ఐఓటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సిల్వన్ ఇన్నొవేషన్ ల్యాబ్ ఉన్నాయి.