బిజినెస్

జిఎస్‌టిఎన్‌పై మరోసారి స్వామి ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ను మరోసారి అధికార బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి లక్ష్యంగా చేసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ దాడిని తీవ్రతరం చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు జిఎస్‌టిఎన్‌ను వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తానని శనివారం తెలిపారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదానికి సంబంధించి తీర్మానం చేసే సమయంలో జిఎస్‌టిఎన్‌ను తప్పక వ్యతిరేకించాలని ట్విట్టర్‌లో స్వామి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లో జిఎస్‌టి ఆమోదం పొందినది తెలిసిందే.