బిజినెస్

మహారాష్టల్రో రోడ్లకు ఏడీబీ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మహారాష్టల్రో రోడ్ల ఆధునీకరణ ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) 200 మిలియన్ డాలర్ల (సుమారు 1,400 కోట్ల రూపాయలు) సాయాన్ని అందించనున్నది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏడీబీ శుక్రవారం ఒక ఒప్పందానికి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 34 జిల్లాల్లో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రోడ్ల నిర్మాణం తర్వాత ఐదేళ్ళ పాటు వాటిని సంరక్షించే ఒప్పందం కూడా జరిగినట్లు భారత్‌లో ఏడీబీ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్ సవ్యసాచి మిత్ర తెలిపారు. ఇందుకు అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అత్యంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.