బిజినెస్

రైతు బజార్లలో రూ.25లకే కేజీ ఉల్లిపాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్) : జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రైతు బజారులో రూ.25లకే కేజీ ఉల్లిపాయల అమ్మకాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉల్లి కొరత, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రైతు బజార్లలో రూ.25లకే కేజీ ఉల్లిపాయలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని రైతు బజారులో ఉల్లి విక్రయాలను మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా ప్రారంభించారు. ప్రజలు తమ ఆధార్ కార్డు తీసుకు వచ్చి కేజీ ఉల్లిపాయలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, రైతు బజారు ఇఓ అమీర్ తదితరులు పాల్గొన్నారు.