బిజినెస్

మాల్యాకు మరోసారి ఇడి సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, ఏప్రిల్ 2: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. 900 కోట్ల రూపాయలకుపైగా ఐడిబిఐ రుణ ఎగవేత కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఇడి.. తాజాగా మూడోసారి మాల్యాకు సమన్లు పంపింది. ముంబయిలో ఈ నెల 9న జరిగే విచారణకు హాజరుకావాలని అందులో మాల్యాకు సూచించింది. నిజానికి శనివారం విచారణ జరగాల్సి ఉండగా, ఇందుకు హాజరు కావాలని గతంలోనే మాల్యాకు ఇడి నోటీసులిచ్చింది. అయితే హాజరయ్యేందుకు తనకు మే నెలదాకా సమయం కావాలని శుక్రవారం మాల్యా కోరారు. దీంతో ఇడి తాజా సమన్లు జారీ చేసింది.