రాష్ట్రీయం

కారు ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాగర్‌కాలులో మునిగిన కారును ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. కారులోనే ఆరు మృతదేహాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నడిగూడి మండలం చాకిరాల వద్ద కారు అదుపుతప్పి ఎన్సీపీ కాలువలోకి దూసుకెళ్లిన విషయం విదితమే. చాకిరాలలో వివాహనికి వెళ్లి వస్తున్న వరుడి స్నేహితులు రెండు కార్లలో తిరుగుప్రయాణం అయ్యారు. ముందు వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. వెనుక కారులో ఉన్న స్నేహితులు కేకలు వేస్తూ 108కి సమాచారం అందించారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఆఫ్ బృందాలు 18 గంటలు శ్రమించి క్రేన్ సాయంతో కారును వెలికితీశారు. ఈ ఘటనలో మృతిచెందిన ఆరుగురి మృతదేహాలు కారులోనే లభ్యమయ్యాయి. మృతులు సికింద్రాబాద్‌ ఏఎస్‌రావునగర్‌లోని సైనిక్‌పురి అంకుర హాస్పటర్‌ సిబ్బంది. అబ్దుల్‌ అజీజ్‌(వైజాగ్‌), జిన్సన్‌(కేరళ), రాజేశ్‌, సంతోష్‌(హైదరాబాద్‌), పవన్‌, నగేష్‌(మల్కాజిగిరి)గా గుర్తించారు.