తెలంగాణ
తెలంగాణలో మరో మహిళకు కరోనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 March 2020
హైదరాబాద్: తెలంగాణలోని కేపీహెచ్బీ కాలనీలో ఒక మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. కేపీహెచ్బీ కాలనీలోని ఫేస్-2లో ఒక మహిళకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. కరోనా సోకిన మహిళ కుటుంబంలోని సభ్యులకు కూడా కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుండగా బాధితురాలి సోదరుడు ఇటీవల యూకే నుంచి వచ్చినట్లు తెలిసింది.