22న రాజా నరసింహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా 22న విడుదలవుతుంది. మన్యం పులి చిత్రంతో విజయం అందుకున్న వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజా చెప్పిందే చేస్తాడు. చేసేదే చెప్తాడు -అన్న ఇంటెన్స్ డైలాగ్‌తో వస్తోన్న రాజా నరసింహ థియేట్రికల్ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. మారుమూల అటవీ ప్రాంతంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారుచేసిన కల్తీ కల్లుకు 75మంది బలైపోతారు. చెప్పిందే చేస్తూ.. చేసేది మాత్రమే చెప్పే నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా కల్తీ కల్లు సమస్యను ఎలా పరిష్కరించాడు. తనను నమ్మినవాళ్లను ఎలా రక్షించుకున్నాడన్నదే సినిమా ఇతివృత్తం. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన బోయపాటి మాట్లాడుతూ -‘మధుర రాజా’ మలయాళంలో హిట్టు. మమ్ముట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ట్రైలర్ బావుంది. తెలుగులోనూ హిట్టు కొడుతుందని ఆకాంక్షిస్తన్నా అన్నారు. నిర్మాత సాధు శేఖర్ మాట్లాడుతూ -చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథానాయకుడిగా మమ్ముట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు నటన అద్భుతం. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన చిత్రంలో సన్నీ లియోన్ ప్రత్యేక గీతం అలరిస్తుంది. 22న సినిమాను థియేటర్లకు తెస్తున్నాం అన్నారు.