సీన్‌లోకి.. పరశురామ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు సెట్స్‌పై ఉన్నపుడే -మహేష్ తదుపరి ప్రాజెక్టు వంశీ పైడిపల్లితో ఉందంటూ కథనాలు వినిపించాయి. మహేష్ సైతం ఆ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా నిర్థారిస్తూ వచ్చాడు. కొద్దిరోజుల్లో మహర్షి కాంబో మళ్లీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్న టైంలో -బిగ్ బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తోంది. వంశీ డిజైన్ చేసిన స్టోరీ నచ్చలేదంటూ మహేష్ పక్కన పెట్టేశాడట. మహేష్ 27 ప్రాజెక్టును పరశురామ్ పట్టాలెక్కించబోతున్నాడంటూ కొత్త కథనం వినిపిస్తోంది. వంశీతో దిల్‌రాజుకు చేయాల్సిన సినిమాను పరశురామ్‌తో మైత్రి మూవీ మేకర్స్‌కు చేస్తున్నాడంటూ వినిపిస్తోంది. ఈ మార్చిలోనే ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లి -వేగంగా పూర్తిచేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయనున్నారన్నది ఆసక్తికరమైన విషయం. గీత గోవిందం హిట్ పడినపుడే పరిశురామ్ మహేష్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడని, ఒకేగానీ ఇప్పుడు కాదంటూ అప్పట్లో మహేష్ చెప్పాడని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందంటూ ఈ కథనాల్లో అనేక కోణాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా -వంశీని పక్కనపెట్టి పరశురామ్‌ని మహేష్ సీన్‌లోకి తీసుకొస్తున్నాడన్న సమాచారం మాత్రం బిగ్ బ్రేకింగ్ న్యూసే. దీనిపై రెండు మూడు రోజుల్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ అనౌన్స్‌మెంట్ చేస్తారని కూడా వినిపిస్తోంది.