మాయచేస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంతను స్క్రీన్‌కు పరిచయం చేసిన సినిమా -ఏం మాయ చేశావే. నాగచైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో సమంత నిజంగానే మాయ చేసింది. తమిళంలో శింబు, త్రిష జోడీగా విన్నాయ్ తాండి వరువాయా టైటిల్ తెరకెక్కి అక్కడా హిట్టుకొట్టింది. చాలకాలంగా ఈ చిత్రానికి సీక్వెల్ రానుందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం ఆ విషయాన్ని దాదాపుగా కన్ఫర్ట్ చేసేశాడు. సీక్వెల్‌నూ శింబుతోనే చేస్తాను అంటున్న గౌతమ్, సమంత ప్లేస్‌లో అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పడం ఆసక్తికరం. చాలాకాలం క్రితమే సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధమైన నేపథ్యంలో -శింబు సమ్మతి కోసం గౌతమ్ ఎదురు చూస్తున్నాడట. ఏం మాయ చేశావే? చిత్రంలో తెలుగులో సమంత, తమిళంలో త్రిష మల్లెతీగల్లా కనిపించారు. ఇప్పుడు సీక్వెల్ కోసం అనుష్కను దర్శకుడు గౌతమ్ ఎంపిక చేసుకోవడం పట్ల ఆసక్తి రెకెత్తుతోంది. వొళ్లు చేసి బొద్దుగా తయారైన అనుష్కను -లవ్ అండ్ యూత్‌ఫుల్ మూవీకి హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడం వెనుక దర్శకుడి ఆంతర్యమేమిటన్న ఆసక్తి మొదలైంది. గౌతమ్ మీనన్ ఫ్రేమ్, విజన్ అంతా డిఫరెంట్‌గా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ పార్ట్‌కి అనుష్కను ఎంపిక చేసుకుంటున్నాడంటే -ఎలాంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు? అన్న ఆదుర్దా మొదలైంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్ధం ప్రాజెక్టు పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఏప్రిల్ 2న ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించినా, సాంకేతిక కారణాలతో విడుదల తేదీ మారే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది.