ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ ఎన్టీఆర్ నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఘాట్‌ను దర్శించుకునే ఆయన ఈ రోజే నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది. అయితే, 28న చెన్నైలో ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’ షూటింగ్‌లో పాల్గొనవలసి వున్నందున ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించి అటునుంచి అటే చెన్నై వెళ్ళారు. ఎన్టీఆర్‌తోపాటు జనతాగ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు యలమంచిలి రవి, మోహన్.సి.వి.ఎమ్ కూడా నివాళులు అర్పించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. చెన్నై షెడ్యూల్ ముగిశాక హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పాట చిత్రీకరణ జరుపుతారు. జూన్ నెలాఖరుకల్లా టాకీపార్ట్ పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.