విష్ణు, రాజ్‌తరుణ్‌ల చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందే చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు మోహన్‌బాబు క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి నిర్మల కెమెరా స్విచ్చాన్ చేశారు. మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ, నాగేశ్వర్ రెడ్డి మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదం పంచే చిత్రమిదన్నారు. ఈరోజునుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నాం. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తామన్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని, రఘుబాబు, వెనె్నల కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:డైమండ్ రత్నబాబు, సంగీతం:సాయికార్తీక్, కెమెరా:సిద్ధార్థ రామస్వామి, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, నిర్మాత:సుంకర రామబ్రహ్మం, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి.