‘మునుము’ పాట విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన్సోవం సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానెల్ సమర్పణలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో పూర్ణచందర్ దర్శకత్వంలో మిట్టపల్లి సురేందర్ సంగీత, సాహిత్యం సమకూర్చిన ‘మునుము’ అనే ప్రత్యేక గీతాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, యాభై సంవత్సరాల ఆకాంక్షకు మునుము పెట్టి ఎందరో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సురేందర్‌తో నా పరిచయం ఒక పాటతో మొదలైందని, అదొక త్యాగాల పాట అని, దాన్ని కానె్సప్ట్‌గా తీసుకొని ‘జై తెలంగాణ’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించానన్నారు. సురేందర్ విత్తనం లాంటివాడని, ఈ పాట ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నాడని చెప్పారు. తన నుండి ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
క్రాంతికిరణ్ మాట్లాడుతూ, పాటను చాలా అందంగా చిత్రీకరించారని, ఆత్మీయ అనురాగాలను గుర్తుచేసే విధంగా ఉందని చెప్పారు.
టిఆర్‌ఎస్ నాయకుడు వి.ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణాలో ఎన్నో విప్లవ పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలు ఎందరో కవులు, గాయకులు పుట్టేలా చేసింది. సురేందర్ రాసిన ఈ మునుము అనే పాట అద్భుతంగా ఉంది. ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అని చెప్పారు.
కల్వకుంట్ల తేజేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకునే విషయంలో కెసిఆర్ ఎంతో కృషిచేశారని, ఆ తెలంగాణ ప్రతిభను ఉట్టిపడేలా సురేందర్ రాసిన సాహిత్యం చక్కగా వుంది అని చెప్పారు. మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ, మునుము అంటే వరుస, క్రమం అనే అర్థాలు వస్తాయని, ఈ పాట నుండి తెలంగాణ చిత్ర తెర వైపు ఒక మునుము పెట్టాలని ఈ టైటిల్‌ను పెట్టానని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రమ్య, భవానిరెడ్డి, అజయ్, రోశన్, బాలు, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.