కథకన్నా కాంబినేషన్లకే ప్రాధాన్యం -నిర్మాత చంటి అడ్డాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇప్పుడు నిర్మాతగా ఎన్ని కథలు విన్నా లాభం లేకుండా ఉంది. కాంబినేషన్లు సెట్ చేసుకున్న తరువాతే సినిమా చేయడం ఉత్తమం’ అని అంటున్నారు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ‘ఆరోప్రాణం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘యముడికి మొగుడు (అల్లరి నరేష్)’, ‘అడవిరాముడు (ప్రభాస్)’ వంటి సినిమాల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. నవీన్ విజయ్‌కృష్ణ, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా చంటి అడ్డాల చెప్పిన విశేషాలు..

జూలైలో విడుదల
విజయనిర్మల మనవడు నవీన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా గ్రాఫిక్ విషయంలో ఆలస్యం అయింది. జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది.
నెక్ట్స్ స్టార్ హీరోతో...
నా తదుపరి సినిమా ఓ పెద్ద హీరోతో ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదల చేస్తాం. ఓ స్టార్ హీరోతో భారీ సినిమా రూపొందుతుంది.
ఇకపై గ్యాప్ రాదు
నిర్మాతగా ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. ముందు పెద్ద సినిమా చేసి ఆ తరువాత మినిమమ్ బడ్జెట్‌లో సినిమాలు ప్లాన్ చేస్తున్నా. ఇకపై మా బ్యానర్‌లో రెగ్యులర్‌గా సినిమాలు తీస్తా.
చిన్న చిత్రాలు కష్టం
నిజానికి చిన్న సినిమా చేసే కన్నా కూడా పెద్ద సినిమా చేయడమే సులభం. ఎందుకంటే చిన్న సినిమా చేయాలంటే అన్ని రకాలుగా భరించే ఓపిక ఉండాలి. వీలయితే విడుదల కూడా చేసుకోగలగాలి. అదే పెద్ద హీరోతో పెద్ద సినిమా అయితే అన్నీ మన దగ్గరికే వస్తాయి.
ఇప్పుడు కాంబినేషన్లదే హవా
నిజానికి ఇప్పుడు కథల కోసం చూస్తుంటే ఏ సినిమా వర్కవుట్ కావడంలేదు. అదే కాంబినేషన్లు సెట్ చేస్తే చాలు. కథల కోసం చాలా డబ్బులు వృధా చేశా. కథలుంటే సరిపోదు.. కాంబినేషన్ కావాలి.
‘సైరత్’కోసం ట్రై..
మరాఠిలో విడుదలై సంచలన విజయం సాధించిన ‘సైరత్’ సినిమా రీమేక్ కోసం ట్రై చేస్తున్నా. దాంతోపాటు మంచి కథలతో ప్రయోగాలు కూడా చేయాలని ఉంది.

-శ్రీ