వరుణ్‌తేజ్‌తో సాయిపల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాత రాజు రూపొందిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా ‘ప్రేమమ్’ చిత్ర హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నారు. త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రం ఓ అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల ఓ మంచి కథ చెప్పారని, జూలై 25న ఈ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్ పూర్తిచేసి అక్టోబర్‌లో అమెరికాలో మరికొంత చిత్రీకరణ జరుపుతామన్నారు. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ఈ సినిమాను సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా:విజయకుమార్, దర్శకత్వం:శేఖర్ కమ్ముల.