వరుణ్తేజ్తో సాయిపల్లవి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
వరుణ్తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాత రాజు రూపొందిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా ‘ప్రేమమ్’ చిత్ర హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నారు. త్వరలో సెట్స్కు వెళ్లనున్న ఈ చిత్రం ఓ అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల ఓ మంచి కథ చెప్పారని, జూలై 25న ఈ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు చివరికి తెలంగాణ షెడ్యూల్ పూర్తిచేసి అక్టోబర్లో అమెరికాలో మరికొంత చిత్రీకరణ జరుపుతామన్నారు. డిసెంబర్లో విడుదల చేయడానికి ఈ సినిమాను సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా:విజయకుమార్, దర్శకత్వం:శేఖర్ కమ్ముల.