దండుపాళ్యం-2 సీక్వెలే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’లో కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలియజేస్తున్నారు. వెంకట్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జి, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే, అదీ హిట్ అయింది. ఇదే ఉత్సాహంతో సీక్వెల్‌ను రూపొందిస్తున్నామని, కానీ కథ, కథనాలు సరికొత్తగానే వుంటాయని తెలియజేస్తూ దర్శకుడు చెప్పిన విశేషాలు.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా 30 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుందని, తెలుగు, కన్నడ భాషల్లో ఇంత ఘనవిజయం సాధించిన ఆ యూనిట్‌తోనే ఈ సీక్వెల్‌ను రూపొందిస్తున్నామని, ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి మంచి క్రేజ్ పొందిందని, బెంగుళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని, అవి సినిమాకే హైలెట్‌గా వుంటాయని నిర్మాత వెంకట్ అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సెనే్సషనల్ హిట్‌గా నిలుస్తుందని, రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా వుంటుందని, సినిమా మొదలునుంచి చివరివరకూ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని ఆయన తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో విడుదల చేయనున్నామని అన్నారు. రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, రవికాలె, పెట్రోల్ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:వెంకట్ ప్రసాద్, సంగీతం:అర్జున్ జన్యా, నిర్మాత:వెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీనివాసరాజు.