5న మరల తెలుపనా ప్రియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచైత్ర చలనచిత్ర పతాకంపై ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా వాణి ఎం.కొసరాజు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. అన్ని కార్యక్రమాలు పూర్తికావడంతో ఈ సినిమాను ఆగస్టు 5న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు వాణి ఎం.కొసరాజు మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా వ్యక్తిత్వాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అందిస్తుందన్నారు. స్ర్తి, పురుషుల మధ్య ప్రేమ స్వచ్ఛంగా ఉండాలనే సందేశంతో ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. ఈ సినిమాను వచ్చేనెల 5న విడుదల చేయనున్నామని ఆమె తెలిపారు. సుజోమ్యాథ్యూ, సన, సమీర్, రవివర్మ, పావనిరెడ్డి, సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: ఎస్.రాజశేఖర్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాణి ఎం.కొసరాజు.