అరణ్యంలో ఎవరెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోషిత్, షాలు, చరణ్ నాయుడు, కరుణాకర్, కల్యాణి ప్రధాన తారాగణంగా వన్ మన్ క్రియేషన్స్ పతాకంపై పాల్వాయి సుదర్శన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అరణ్యంలో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సుదర్శన్‌రెడ్డి పాల్వాయి మాట్లాడుతూ- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. నాగరికత అంటే కేవలం మనుషులు ధరించే బట్టల్లో మార్పులు రావడం కాదని, ఏ కాలంలో అయినా మహిళలను గౌరవించాలని చెప్పే కథనంతో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసిన ఈ చిత్రాన్ని దాదాపు 60 రోజులపాటు అడవులలో చిత్రీకరణ జరిపామని, అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వున్న ఈ చిత్రం విడుదలయ్యాక సీక్వెల్‌గా అరణ్యం-2 చిత్రాన్ని నిర్మించనున్నామని తెలిపారు. మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నేటి ట్రెండ్‌కు తగిన విధంగా దర్శకుడు సన్నివేశాల చిత్రీకరణ జరిపారని కథానాయకుడు చరణ్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో షాలు, అజయ్‌పట్నాయక్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.