సెట్స్‌పైకి చరణ్-సుకుమార్‌ల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ్ సూపర్‌హిట్ చిత్రం ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. వచ్చే నెలతో అన్ని కార్యక్రమాలు పూర్తికానున్నాయి. ఇక ఈ సినిమా తరువాత చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వస్తుందని దర్శకుడు సుకుమార్ తెలిపాడు. నాన్నకు ప్రేమతో తరువాత సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ నటిస్తుందట. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం వుంది.