అనురాగ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపట్టే రాఖీ పండుగ వేడుకలను దేశమంతా ఆనందంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినిమా తారలు కూడా తమ సోదరులకు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను పంచుకున్నారు. తాజాగా హీరో వరుణ్ తేజ్ రాఖీకట్టింది నిహారిక. అలాగే హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్య త్రిపాఠి, పరిణితి చోప్రా, ఏక్తాకపూర్‌లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
**
వరుణ్‌తేజ్ స్పందిస్తూ- ఈ క్యూటీ రాఖీ కట్టడానికి నా సినిమా షూటింగ్ బాన్సువాడలో జరుగుతుంటే అక్కడికి వచ్చింది అని ట్వీట్ చేశాడు. ఇలా చిత్రసీమకు రాఖీ పండుగ కొత్త వెలుగు తెచ్చింది.
రకుల్‌ప్రీత్‌సింగ్: ధ్రువ సెట్‌లో రక్షాబంధన్ జరుపుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం బ్రదర్. నువ్వే నా బెస్ట్‌ఫ్రెండ్ అంటూ కామెంట్ పెట్టింది.
హన్సిక: లవ్‌లీ సిస్టర్స్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఇలాంటి వ్యక్తి నాకు సోదరుడుగా దొరకడం అదృష్టం అంటూ కామెంట్ పెట్టింది.
లావణ్యత్రిపాఠి: అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మా బ్రదర్‌తో పండగ జరుపుకున్నా అంటూ కామెంట్ పెట్టింది.
తుషార్‌కపూర్: అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఎప్పుడూ మీ సోదరీమణులకు అండగా ఉండండి అంటూ కామెంట్ పెట్టాడు.