త్వరలో త్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘త్రయం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, ముగ్గురు వైవిధ్యమైన వ్యక్తిత్వం వున్న మనుషుల కథనం నేపథ్యంలో చిత్రం సాగుతుందని, సినిమాను వీలైనంతవరకూ రియలిస్టిక్‌గా రూపొందించే ప్రయత్నం చేశామని తెలిపారు. ఫైట్స్‌లో ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చిత్రీకరించామని, ఇవి హైలెట్‌గా వుంటాయని అన్నారు. ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్ కలిగేలా చిత్రం వుంటుందని, పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందిన త్రయం సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి నిర్మాత:పద్మజా నాయుడు, దర్శకత్వం:డాగౌతమ్.