అవును..విడిపోతున్నాం .......... విడాకులపై సౌందర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహబంధం తెగిపోయిందని, ఆమె విడాకులు తీసుకుందని వచ్చిన వార్తలపై స్వయంగా ఆమే స్పందించింది. ట్విట్టర్ వేదికగా శనివారంనాడు ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘నేను, నా భర్త ఏడాదిగా వేరుగా ఉంటున్నాం. విడాకుల కోసం చర్చలు జరుగుతున్నాయి. నా వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రైవసీని దెబ్బతీయకండి’ అంటూ ట్వీట్ చేసింది. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యకు 2010లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వీరిది ప్రేమవివాహం. వీరికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో వీరు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాగా వారి వివాహబంధం తెగిపోకుండా ఉండేందుకు చివరిప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందుకే మీడియా ప్రశ్నలవర్షం కురిపించినా ఆమె భర్త అశ్విన్ స్పందించడం లేదు. అయితే వీరిద్దరి మధ్య విబేధాలకు కారణాలు మాత్రం ఇంకా బయటకిరాలేదు. కుటుంబ వ్యవహారాలు, రజనీకాంత్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సౌందర్య, అశ్విన్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు పంచుకునేవారు. కాగా కొద్దికాలంగా ఆమె వౌనం వహించారు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. గ్రాఫిక్ డిజైనర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టిన సౌందర్య తండ్రి హీరోగా నటించిన ‘కొచ్చెడియాన్’కు దర్శకురాలిగా, అంతకుముందు ‘గోవా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది.