మనసంతా నువ్వేకు ప్లాటినమ్ డిస్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పవన్, బిందు బార్బీ జంటగా దేవి చౌదరి రూపొందిస్తున్న చిత్రం ‘మనసంతా నువ్వే’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- దర్శకుడు యధార్థ సంఘటనను ఆధారం చేసుకొని రాసుకున్న ఈ కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ మొదలుపెట్టామని, అనేక సవాళ్లను ఎదుర్కొని సినిమా పూర్తిచేశామని తెలిపారు. కర్నాటకలో ఆరేడు చిత్రాల్లో హీరోగా నటించిన తాను, తెలుగులో నటించానని, ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని రాజీవ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:ర్యాప్ రాక్ షకీల్, నిర్మాత:పసుపులేటి దేవీ చౌదరి, దర్శకత్వం:శివనాగేశ్వరరావు.