మిస్టర్ 420 వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ 420’. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గజ్జల హరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ, సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిందని, సినిమా చాలా బాగా వచ్చిందని, సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అన్నారు. సినిమాలో హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ హీరోయిన్‌ను చూడగానే ప్రేమలో పడతాడని, అనుకోని ఘటనతో హీరో జీవితం మలుపు తిరుగుతుందని, అదేంటనేదే సినిమా అని అన్నారు. వరుణ్ సందేశ్ కెరీర్‌లోనే బెస్ట్‌మూవీ అవుతుందనే నమ్మకం వుందని, హీరోయిన్ ప్రియాంక ముంబై నుండి తెలుగులోకి ఎంట్రీ ఇస్తోందని, ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్‌తో మా బ్యానర్‌లో రెండో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. దర్శకుడు ఎస్.ఎస్.రవికుమార్ కథను బాగా తెరకెక్కించారన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, సినిమాలో అవినాష్ అనే యువకుడి పాత్రలో కనిపిస్తానని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగా రావడానికి రీషూట్ కూడా చేశామని అన్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నానని, అందులో ఒక చిత్రంలో రైతు పాత్ర చేస్తున్నానని, రామూర్తి దర్శకుడు. ఇక రెండో సినిమా రాఘవేంద్రరావుగారి వద్ద పనిచేసిన సత్యనారాయణ దర్శకత్వంలో చేస్తున్నానని అన్నారు. హీరోయిన్ ప్రియాంక భరద్వాజ్ మాట్లాడుతూ ‘మిస్టర్ 420’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉందని, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను అన్నారు.