యదార్థ సంఘటనలతో మనలో ఒకడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.పి.పట్నాయక్‌సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. యూని క్రాఫ్ట్ పతాకంపై జగన్మోహన్ నిర్మిస్తున్నారు. అనితారెడ్డి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, అందుకే తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకను జరిపామని అన్నారు. థియేటర్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తోందని, కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా మనలోఒకడు కథను రాసుకున్నామని ఆయన అన్నారు. కృష్ణమూర్తి అనే అధ్యాపకుడిగా తాను నటించానని, సాయికుమార్ పాత్ర కూడా హైలెట్‌గా ఉంటుందని, తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుందని ఆయన అన్నారు. ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంత ప్రధానమైనదో మనకు తెలుసని, అదే నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత జగన్మోహన్ అన్నారు. జెమినీ సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.జె.సిద్ధార్థ్, పాటలు: చైతన్యప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, నిర్మాత: జగన్మోహన్, సంగీతం, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.