బస్ జర్నీలో మిక్చర్‌పొట్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయంత్, శే్వతాబసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్‌కుమార్.ఎం.వి. దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. చిత్ర నిర్మాతలలో ఒకరైన లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పూర్తి కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నప్పటికీ ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, సినిమా ద్వారా సమాజానికి చిన్న సందేశాన్ని కూడా అందజేస్తున్నామని అన్నారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, జబర్దస్త్ టీం.. అలీ, పోసాని, కృష్ణ్భగవాన్ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని అన్నారు. శే్వతాబసు ప్రసాద్‌వల్ల సినిమాకు మంచి హైప్ వస్తుందని, త్వరలోనే ఆడియో, డిసెంబర్‌లో సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. దర్శకుడు సతీష్‌కుమార్ మాట్లాడుతూ అమలాపురం నుంచి షిర్డీ వెళ్ళే బస్సు జర్నీ నేపథ్యంతో కథను తెరకెక్కించామని, సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. ఇతర పాత్రల్లో గీతాంజలి, అలి, భానుచందర్, కృష్ణ్భగవాన్, సుమన్, పోసాని కృష్ణమురళి, అమిత్‌భార్గవ్, ఫిష్ వెంకట్, రేలంగి, చిట్టిబాబు, భద్రం, జబర్దస్త్ మురళి, ఫణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు:చిరంజీవి.ఎస్., కెమెరా:కళ్యాణ్ సమి, ఎడిటింగ్:ఎమ్.ఆర్.పరమ్, సంగీతం:మాధవపెద్ది సురేష్, కథ, కథనం, దర్శకత్వం:సతీష్‌కుమార్.ఎం.వి.