అమీషా రీ ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హిట్ సినిమా ‘బద్రి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్ ఆ తరువాత మహేష్‌బాబుతో నాని, న్టీఆర్‌తో నరసింహుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. 2011లో నందమూరి బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్‌వైపు వెళ్లిపోయింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఒక ఐటెం సాంగ్‌తో కావడం విశేషం. ‘ఆకతాయి’ అనే సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ పాటలో మెప్పించనుంది అమీషా పటేల్. ఈ పాట చిత్రీకరణ సారథి స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్‌లో జరిగింది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ సందర్భంగా అమీషా పటేల్ మాట్లాడుతూ- ‘చాలా ఏళ్ల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నా. ఆశిష్‌రాజ్ హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ భీమన డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు’ అని తెలిపింది.