23న కోటీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ చంద్ర, పృధ్వీ, సలోని, శృతిశోధి ప్రధాన తారాగణంగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేద్దామనుకున్నామని, అయితే అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని వచ్చేనెల 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని, ఆడియో కూడా సూపర్‌హిట్ అయిందని, తప్పక ఈ సినిమా కూడా పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు. జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖ రామన్, మీనా, నేహాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:బాల్‌రెడ్డి.పి., కథ, మాటలు:నాగేంద్ర కుమార్ వేపూరి, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.