తాతామనవళ్ల బంధం.. శతమానం భవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ముగింపుదశలో వుంది. రానున్న సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తండ్రీకొడుకుల మధ్య వుండే సంబంధాన్ని ‘బొమ్మరిల్లు’లో అందంగా చెప్పామని, ఇప్పుడు ఈ చిత్రంలో తాతామనవళ్ళ మధ్య వుండే బంధాన్ని కుటుంబ కథా చిత్రంగా రూపొందించామని తెలిపారు. ‘బొమ్మరిల్లు’ ఎంత విజయవంతమైందో అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్, గోదావరి జిల్లాలలో షూటింగ్ చేసిన ఈ చిత్రం అచ్చ తెలుగు కథగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని తెలిపారు.